![]() |
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ |

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. తణుకులో ఆయన వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాల, ట్రస్ట్ ఆసుపత్రి, ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్ లైబ్రరీ స్థాపించారు. రంగరాయ వైద్య కళాశాల ఏర్పాటులో ఆయన కృషి ప్రశంసనీయం. ధార్మికరంగంలో విజయవాడ తపోవనం, జూబ్లీహిల్స్లో శ్రీసీతారామస్వామి ధ్యాన మందిరం, భద్రాచలంలో సీతారామస్వామి దేవస్థానం, నరసాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, విశాఖపట్నం ప్రేమ సమాజం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అధ్యక్షునిగా, పాలకమండలి సభ్యునిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. తణుకు వెంకట్రాయపురంలో ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక ఆసుపత్రి, కంటి ఆసుపత్రిని నిర్మించి ఎందరో పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.
హరిశ్చంద్ర ప్రసాద్ సెప్టెంబరు 3, 2011 న హైదరాబాదులోని బంజారా కేర్ వైద్యశాలలో మరణించాడు.
ఆంధ్రా షుగర్స్ పరిశ్రమ ప్రత్యేకతలు
- గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ.
- గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడ సమ్మె జరగలేదు.
- 1947లో రోజుకి 600 టన్నుల చెరకు Crushing తో మొదలయ్యి ప్రస్తుతము 10,000 టన్నులు Crushing చేరింది.
- దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ.
- ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత.
- భారత దేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి