31, మే 2016, మంగళవారం

Coconut Tree, know some facts


పువ్వు, కాయ , పండు ఇది సృష్టి చక్రంలో పరిణామక్రమం. కాని ఎప్పుడు కాయ గానే వుండే అద్భుత ఫలం కొబ్బరి కాయ. లేతగా వున్నప్పుడు "బొండం" గా పిలవబడుతూ అందరి దాహం తీరుస్తుంది, కొద్దిగా ముదరగానే కొబ్బరి కాయగా పిలవబడుతూ అతి పవిత్రమైన దైవ కార్యాలలోను, మన నిత్య జీవితంలోను అనేకరకాలుగా ఉపయోగపడుతుంది.   సృష్టిలో ఎన్నో ఫలాలున్నా వాటిలో  "పండు" అవస్థ లేనిది ఒక్క కొబ్బరికాయకి  మాత్రమే. అది ఎప్పుడూ కాయే! పండి పోవడం తెలియని కాయ. దాని పుట్టుకే విశిష్టతతో కూడుకున్నది.

దైవారాదనలో , భోజనంలో, వివాహంలో, బతుకుదెరువులో కొబ్బరికి ఉన్న ప్రాముఖ్యత  భూమ్మీద మరిదేనికీ లేదు.  సర్వకాల సర్వావస్థల్లోనూ అది ఉపయోగపడినట్టే, కొబ్బరిచెట్టులోని ప్రతి భాగం మనకు పనికొస్తాయి. అందుకే కొబ్బరి చెట్టుని    "భూలోక కల్పవృక్షం"  అని పిలవవచ్చు.  ఇలాంటి కొబ్బరిచెట్టు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము. 

ఆరోగ్యంగా ఉంటే కొబ్బరిచెట్టు  సంవత్సరానికి  కనీసం 75 కాయలు దిగుబడి ఇస్తుంది . 

కొబ్బరి పంట దగ్గర దగ్గరగా 92 దేశాల్లోని సుమారు మూడు కోట్ల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. సంవత్సరానికి సుమారు  6 కోట్ల టన్నుల కాయలు  దిగుబడి జరుగుతుంది . భారతదేశం, ప్రపంచంలో 16% వాటాతో మూడో స్థానంలో వుంది. మళ్లీ మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కొబ్బరిలో  92%  -  కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలదే . తిరిగి ఇందులో  సగం వాటా కేరళ రాష్ట్రానిదే. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కొబ్బరి తోటలు మన కోనసీమ లోనే వున్నాయి.  

కొబ్బరి అత్యధికంగా పండించే తొలి పది దేశాలు 1.ఇండోనేషియా  2.ఫిలిప్పీన్స్ 3. భారత్  4.శ్రీలంక  5.బ్రెజిల్   6.థాయిలాండ్ 7.వియత్నాం  8.మెక్సికో  9.పాపువా న్యూ గినియా  10.మలేషియా

 మాల్దీవుల జాతీయవృక్షం కొబ్బరిచెట్టు. జాతీయచిహ్నంలో కూడా కొబ్బరి చెట్టు ఉంటుది. 


కొబ్బరి తడిక / చాప
కొబ్బరి చెట్టు సాదారణంగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిలోని ప్రతిభాగాన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో కొబ్బరి దుంగలతో పడవలను(బోట్స్) తయారుచేస్తారు.  కొబ్బరిమట్టల్నిఇప్పటికి గోదావరి ప్రాంతంలో తమ ఇల్లు పైకప్పు మీద  తలదాచుకోవడానికి వాడతారు. కొబ్బరి ఆకులతో  తడికలు, చాపలు అల్లుకోవచ్చు. బుట్టలు చేసుకోవచ్చు. పనితనం తెలిసినవాళ్లు ఆకులతో పిల్లలకు ఆటవస్తువులు చేసివ్వొచ్చు. కొబ్బరిపీచుతో తాళ్లు పేనుకోవచ్చు, పరుపులు, కాళ్ళు శుబ్రం చేసుకునే  మ్యాట్స్ తయారు చేసుకోవచ్చు , గిన్నెల్ని తోముకోవచ్చు, కొబ్బరి ఇటుకలు చేసుకోవచ్చు. కొబ్బరి ఈనెలను వుపయోగించి చీపుర్లు తయారుచేస్తారు. 

 నీళ్లనూ, పాలనూ, నూనెనూ, కొబ్బరినీ, టెంకనూ, మీది పీచును కూడా వినియోగించుకోగలిగే అద్భుత ఫలం ఇది. అసలు ఇందులో వృథా అయ్యేది ఏదీ లేదు. కాయ, ఆకు, కాండం అన్నీ పనికొచ్చేవే! ఆకలి తీర్చి, దప్పిక తీర్చి, పోషకాహారాన్ని ఇచ్చి, నీరసంగా ఉంటే అలసట తీర్చి శక్తిని అందించే ,  ఇలాంటి చెట్టును "కల్పవృక్షం" అనికాకుండా మరేమంటారు? అందుకే ఒక్క కొబ్బరిచెట్టు మనిషి మనుగడకు అండాదండ. అందుకే కొబ్బరికి అంత ప్రాధాన్యత.

ఇక శరీరానికి ఆరోగ్యం అందించే విషయం లోను కొబ్బరిది అగ్రస్థానమే. A Coconut  a day keeps the Urologist away (రోజు ఒక కొబ్బరి బొండం  తాగితే, మూత్రపిండాలకు సంబంధించిన వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం రాదు) అనే సామెత కుడా వాడుకలో వుంది. బొండం నీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలాంటి ఖనిజ లవణాలు వుంటాయి. కొబ్బరి బొండం నీరు శరీరంలో వుండే అధిక ఉష్ణాన్ని తగ్గిస్తుంది.  చిన్నప్రేవుల్లోని పురుగుల్ని చంపేస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి కలిగివుంటుంది. మూత్రం సాఫీగా జరిగేటట్టు చేసి, శరీరాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది. నీరసంగా ఉన్నవాళ్లకు కూడా కొబ్బరి ఎంత సులభంగా శరీరంలో కలిసిపోగలదంటే, దాన్ని జీర్ణం చేయడానికి ప్రత్యేకంగా పైత్యరసం ఉత్పత్తి కానవసరం లేదు. అందుకే అది నేరుగా రక్తంలో కలిసిపోయి, తక్షణం శక్తి ఇస్తుంది. అందుకే దాన్ని జీవద్రవం అంటారు.

కొబ్బరినీరు రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయం కాగలదు. పైగా ఎర్ర రక్తకణాలకు హాని చేయదు, అలెర్జీ కలిగించదు. అందుకే యుద్ధ సమయాల్లో ఐ.వి.(ఇంట్రా వీనస్) ద్రవాలు అందుబాటులో లేని సందర్భాల్లో- ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధం, వియత్నాం యుద్ధ కాలంలో- అప్పుడే దింపిన తాజా కొబ్బరినీటిని సైనికులకు నేరుగా ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించేవారు.


ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కొబ్బరి కి కుడా ఒక ప్రత్యేకదినం వుందని  మీకు తెలుసా.....  ప్రతీ ఏడాది సెప్టెంబర్ 2 వ  తారీఖున "వరల్డ్ కొకొనట్ డే" ను జరుపుకుంటారు.  ఇండోనేషియా కేంద్రంగా ఉన్న ఏసియన్ అండ్ పసిఫిక్ కొకొనట్ కమ్యూనిటీ(APCC) ఆవిర్భావ రోజునే ఈ "వరల్డ్ కొకొనట్ డే" ని జరుపుకుంటారు. భారత్ సహా, కొబ్బరి అత్యధికంగా పండించే దేశాలన్నీ ఇందులో సభ్యత్వం కలిగివున్నాయి. కొబ్బరి ప్రాధాన్యతను గురించిన అవగాహన కల్పించడం, పేదరిక నిర్మూలనలో కొబ్బరి పాత్ర తెలియజెప్పడం, మొత్తంగా కొబ్బరి పరిశ్రమ వృద్ధి అయ్యేలా చూడటం ఈ APCC (Asian and Pacific Coconut Community) లక్ష్యాలు.




30, మే 2016, సోమవారం

Coconut Workers (కొబ్బరి దింపు,ఒలుపు కార్మికులు)

తూర్పుగోదావరి జిల్లా (East Godavari) లోని కోనసీమ (Konaseema) పేరు చెబితే ... సిరులు కురిపించే కొబ్బరి పంట అందరికీ గుర్తుకొస్తుంది. కోనసీమ అంతటా ఎక్కడ చూసినా  మనని  మైమరిపించే,  అంబరాన్ని చుంబించే పచ్చని కొబ్బరిచెట్లే కనిపిస్తాయి. ఇంత అందమైన కొబ్బరిచెట్ల నుంచి మనకు కావలసిన కొబ్బరికాయల్ని,ఇతర ఉత్పత్తులను అందిస్తున్న కార్మికుల పని వివరాలను పరిశీలిద్దాము.  

ఇక అసలు విషయానికి వస్తే, కొబ్బరి ఉత్పత్తులు మన దగ్గరకు చేరడానికి ముందు చాలా మంది కార్మికుల శ్రమ అందులో వుంటుంది. ఈ ఉత్పత్తులను తయారుచేయడానికి రకరకాల నైపుణ్యం కలిగిన కార్మికులు అవసమవుతారు. వారిలో ప్రముఖ పాత్ర కొబ్బరి దింపు కార్మికులు, కొబ్బరి ఒలుపు కార్మికులు, కొబ్బరి కాయలను నాణెం చేసే కార్మికులది.  కోనసీమలోని 16 మండలాల్లో విస్తరించి ఉన్న కొబ్బరి పంటపై ఆధారపడి సుమారు ఒక లక్ష కుటుంబాల వారు  కార్మికులుగా  జీవనోపాధి పొందుతున్నారు. కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులు చేసే పని  నిజంగా సాహసంతోను, ప్రమాదంతో  కూడుకున్నది.

దింపు కార్మికులు
దింపు కార్మికులు, దింపు తీసే సమయంలో పట్టు జారినా, విద్యుత్తు తీగలు తగిలినా చాలా ప్రమాదంలో పడతారు. చాలా సార్లు ప్రమాదానికి గురైన కార్మికులు ఉపాధికి శాశ్వతంగా దూరమౌతున్నారు.

కొబ్బరి ఒలుపు కార్మికులు












ఇక కొబ్బరి ఒలుపు కార్మికుడు వయస్సును బట్టి వంట్లో ఉండే శక్తిని బట్టి 500 నుంచి వెయ్యి కాయలు ఒలుస్తారు. వెయ్యి కాయలు ఒలుపునకు రూ.350 ఇస్తారు. ,కొబ్బరి ఒలుపులో ఆదమరిస్తే రెప్ప పాటులో బల్లెం అరచేతిలో లేదా కాలి తొడ, గుండెలలో దిగబడిపోయి ప్రాణాపాయం జరుగుతుంది. ఒలుపు ఒలుస్తూ బల్లెం గుండెల్లో దిగబడి చనిపోయిన ఒలుపు కార్మికులున్నారు. 


నువ్వాదరిని... నేనీదరిని ....గోదారి కలిపింది ....ఇద్దరినీ (4)



బాపు-రమణ 
బాపు-రమణ ఈ జంట గురించి తెలియనివారు వుండరు. సాహితీ రంగంలో మరియు తెలుగు సినిమా రంగంలో వీరిద్దరి సేవలు మరపురానివి. తూర్పుగోదావరి  జిల్లాలో పుట్టిన  ముళ్ళపూడి వెంకటరమణ (రమణ), పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ఎక్కడ, ఎప్పుడు కలిసారోగాని గొప్ప జంటగా పేరుగాంచారు.  ఇద్దరిది విడదీయరాని బంధం. హైస్కూల్ విద్య నుంచి మిత్రులైన బాపురమణలు చివరి వరకూ కలిసే ఉన్నారు. ముళ్లపూడి మరణించాక తన సగం ప్రాణం పోయిందన్నారు బాపు . బాపురమణలు గోదావరి తీరానికి అటూ, ఇటూ గట్టి వారధిలా నిలిచి ఉభయ గోదావరి జిల్లాల మైత్రి భందాన్ని మరింత బలపరిచారు. స్నేహానికి అర్ధాన్ని నిర్వచించారు.  


సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు)

బాపుకు తెలిసినవి రెండే.. ఒకటి బొమ్మలు గీయడం, రెండు సినిమాలు తీయడం. ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహించిన ఆయనను  పద్మశ్రీ బిరుదుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బాపు అసలు పేరు  సత్తిరాజు లక్ష్మినారాయణ. పశ్చిమ గోదావరిజిల్లా,నరసాపురంలో  1933డిసెంబర్ 15న జన్మించిన ఆయన మద్రాసు పిఎన్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. అప్పుడే  ముళ్ళపూడి వెంకటరమణ ఆయనకు బాల్యమిత్రుడయ్యారు. బాపు, వారపత్రికలకు చిత్రాలు వేసేవారు. బుడుగు, గిరీశం, బుచ్చమ్మలు ఎంతో పేరు పొందాయి. 

వీరిద్దరూ  1987లో ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రాధమిక వీడియో విద్యకు పాఠాలు రూపొందించారు. "సాక్షి" సినిమాతో 1967లో సినిమా రంగంలో ప్రవేశించారు.  సాక్షి సినిమాని పులిదిండి, లొల్ల గ్రామాల్లో షూటింగ్ చేసారు. . సీతా కళ్యాణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, సంపూర్ణ రామాయణం, పెళ్ళిపుస్తకం, రాధాగోపాలం ఇలా అనేక సినిమాలు తీశారు. ఎన్నో సినిమాలకు నంది అవార్డులు, జాతీయ అవార్డులు లభించాయి. ఈ సినిమాలన్నీ బాపురమణ ధ్వయమే రూపొందించింది. చివరిలో ఆయన శ్రీరామరాజ్యం సినిమా తీశారు. 2013లో దివంగతులయ్యారు. 

ముళ్ళపూడి వెంకటరమణ(రమణ)

1931జూన్ 28న తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జన్మించారు. వీరిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. 9ఏళ్ళ వయసులో తండ్రి మరణించడంతో, మద్రాసు చేరుకున్నారు. అక్కడే ఆయన బాపుని  కలిసారు. ఒకరికొకరు మంచి స్నేహితులయ్యారు . రమణ కథ రాస్తే బాపు బొమ్మ గీసేవారు. ముళ్ళపూడి కూడా 1954లో ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్గా చేరారు. తరువాత వారపత్రికకు మారి సినిమా విభాగాన్ని చూసేవారు. అలా సినిమారంగం వైపు వెళ్ళడానికి కారణమైంది. ఆయన కథ అందించిన తొలి చిత్రం రక్తసంబంధం తరువాత మూగమనసులు, దాగుడు మూతలు, సాక్షి, బుద్ధిమంతుడు ఇలా 39 సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే , మాటలు అందించారు. బాపు దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలకు పనిచేశారు. వారిద్దరూ "చిత్రకల్పన" బ్యానర్ ని స్థాపించి  అందాల రాముడు, సీతా కళ్యాణం వంటి 4 సినిమాలు నిర్మించారు. ఈ జంట రఘుపతి వెంకయ్యఅవార్డు గెలుచుకుంది. రాజ్యలక్ష్మి పురస్కారం, యూనివర్శిటీలు డాక్టరేట్ అందజేశాయి. ముళ్ళపూడి 2011 ఫిబ్రవరి 24న దివంగతులయ్యారు.

29, మే 2016, ఆదివారం

నువ్వాదరిని... నేనీదరిని ....గోదారి కలిపింది ....ఇద్దరినీ (3)


రేలంగి -సూర్యకాంతం

పాత తరం సినిమా ప్రేక్షకులకు సూర్యకాంతం, రేలంగి జంట పేర్లు వింటేనే మనసు ఉల్లాసమవుతుంది. ఎందుకంటే గయ్యాళి భార్యగా సూర్యకాంతం, అమాయకపు భర్తగా రేలంగి నటన తెరపై బాగా పండేది. 



సూర్యకాంతం

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు చెందిన సూర్యకాంతం, పశ్చిమగోదావరి జిల్లా  తాడేపల్లిగూడెంకు చెందిన రేలంగి ఇద్దరూ పాతతరం సినిమాల్లో 40 ఏళ్ళ పాటు ప్రేక్షకులను అలరించారు. భర్తను అదుపులో ఉంచుకునే గడసరి ఇల్లాలి పాత్ర, గయ్యాళి అత్త పాత్రలకు ఆమె మారుపేరు. దొంగరాముడు, తోడి కోడళ్ళు, ఇద్దరుమిత్రులు, చదువుకున్న అమ్మా యిలు, చక్రవర్తి వంటి అనేక సినిమాల్లో రేలంగిని నిత్యం వేధిస్తూ కొంగున ముడేసుకునే పాత్రలు పోషించారు. 1927 డిసెంబర్ కాకినాడలో పొన్నమండ అనంతరామయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించిన సూర్యకాంతం 19వ ఏటే ‘నారద నారది’ అనే సినిమాలో నటించారు. వెలుగునీడలు, మంచి మనుషులు, మాయాబజార్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. మాయాబజారులో సుపుత్ర నీకిది తగదంటిని కదరా అన్న మేనరిజంతో ఆకట్టుకున్నారు. 1994లో ఆమె పరమపదించారు.

రేలంగి

సూర్యకాంతానికి జోడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లాలో  జన్మించినప్పటికీ తరువాత వారి కుటుంబం  తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. 1910లో జన్మించిన రేలంగి, 1935లో శ్రీకృష్ణ తులాభారంలో విదూషకునిగా నటించారు. తరువాత గొల్లభామ, కీలుగుర్రం, గుణసుందరి కధ, పాతాళభైరవి, పెద్దమనుషులు, మిస్సమ్మ, చెంచులక్ష్మి, అప్పు చేసి పప్పుకూడు, భీష్మ ఇలా 500పై చిలుకు సినిమాల్లో నటించారు. ఒకే షాట్లో ముఖంలో భావాలను మార్చిమార్చి ప్రదర్శించడం, మాటలన్ని మంచి టైమింగ్ లో  పలికి హాస్యాన్ని పండించడంలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. 

28, మే 2016, శనివారం

తాపేశ్వరం కాజా - ఆత్రేయపురం పూతరేకులు

తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు వీటి గురిచి తెలియని గోదావరి జిల్లా వాసులు ఉండరంటే అతిశయోక్తికాదు. ఇవి మన తూర్పుగోదావరి జిల్లాకి గొప్ప కీర్తి,  ప్రతిష్ట లని తీసుకువచ్చాయి. వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము.  

తాపేశ్వరం కాజా



తాపేశ్వరం కాజా అంటే తెలియని వారు వుండరు. ఇది ఖండాంతర ఖ్యాతి నార్జించింది. . తాపేశ్వరం కాజాను మొట్టమొదటిగా కనిపెట్టి, తయారు చేసింది పోలిశెట్టి సత్తిరాజు గారు . తూర్పుగోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామానికి చెందిన సత్తిరాజు 80 ఏళ్లక్రితం ఉపాధి నిమిత్తం తన కుటుంబ సభ్యులతో తాపేశ్వరం వలస వచ్చి చిరుద్యోగం చేసేవారు . అనంతరం చిన్న హోటల్లో మిఠాయిలను తయారు చేసి అమ్మేవారు.

అప్పట్లో ప్రత్యేక స్వీట్లు తయారుచేయాలన్న తలంపుతో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి, పంచదార పాకం పెట్టి అమ్మేవారు. ఆ కాజాకు తక్కువ కాలంలోనే ఎంతో పేరు వచ్చింది. దాంతో తాపేశ్వరం కాజా రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. రాష్ట్రంలో ఎక్కడైనా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీప్రముఖులు ఇంట ఏదైనా శుభకార్యాలు లేదా మరేదైన కార్యక్రమాలు నిర్వహిస్తే తాపేశ్వరం కాజా తప్పకుండా ఉంటుంది. కాజాను 50 గ్రాముల నుంచి 500 గ్రాములు బరువు ఉండే విధంగా రకరకాల సైజులలో తయారు చేస్తారు. రాష్ట్రంలో తాపేశ్వరం పేరుతో పలు పట్టణాల్లో 300 వరకు స్వీటుస్టాల్లు ఉన్నాయి. ఇదంతా సత్తిరాజు చలవేనని వారంతా చెప్పుకుంటూ ఉండడం విశేషం. సత్తిరాజు కుటుంబంలో వారంతా ఇదే వ్యాపారంలో స్థిరపడ్డారు. కాజా సృష్టికర్త సత్తిరాజు ఈ లోకాన్ని విడిచి రెండు దశాబ్ధాలు కావస్తున్నా ఆయన తయారు చేసిన వంటకం అందరి మదిలో తీపి గుర్తుగా చెరగని ముద్ర వేసింది.



ఆత్రేయపురం పూతరేకులు



పూతరేకులు పేరువినగానే వాటి పుట్టిలలయిన ఆత్రేయపురం ఎవరికైనా గుర్తురావడం ఖాయం. ఆత్రేయపురం పూతరేకులు పేరు చెపితే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికయినా నొరూరవలసిందే . ఆత్రేయపురం ప్రాంత మహిళలు తయారు చేసే పూతరేకులకు ఓ ప్రత్యేకత ఉంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఇవి 300 ఏళ్లుగా ఇక్కడ కుటీర పరిశ్రమంగా విస్తరించింది. వివాహాది శుభకార్యాలకు, విందులకు, వినోదాలకు ఈ పూతరేకులు విశేషంగా వినియోగిస్తారు. ఈ పరిశ్రమపై ఇక్కడి సుమారు 800 కుటుంబాలు జీవిస్తున్నాయి.

హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై, విశాఖపట్నం, కలకత్తా  తదితర ప్రాంతాలతోపాటు దుబాయి, అమెరికా, సింగపూర్ వంటి ఇతర దేశాలకు తీసుకెళుతుంటారు. నోటిలో పెట్టగానే కరిగిపోయే పూతరేకుల  తయారీలో ఇక్కడి నిపుణులది అందివేసిన చేయి. ఒక్క ఆత్రేయపురంలో ఏటా రూ. కోటి రూపాయలు పైబడి పూతరేకుల వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రాంత మహిళలు మగవారికి ధీటుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పూతరేకుల తయారీలో కష్టపడుతుంటారు. పూతరేకుల తయారీ రెండు దశలుగా ఉంటుంది. మొదటిగా రేకుల తయారీ. రెండోది తినడానికి వీలుగా పంచదార, నెయ్యి, యాలికులు, బాదం తదితర మిశ్రమాల పొడివేసి చుట్టలుగా తయారు చేయడం. ఇది చాలా నేర్పుతో జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ఒక్కో పూతరేకుచుట్ట రూ. 5 నుంచి 10 వరకు అమ్ముతారు.


నువ్వాదరిని... నేనీదరిని ....గోదారి కలిపింది ....ఇద్దరినీ (2)


Kadukuri - Chilakamarthy
కవిగా, సంస్కరణవేత్తగా, పత్రిక రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందిన తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు,  జాతీయ కవిగా పేరు పొందిన పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన చిలకమర్తి లక్ష్మినరసింహం పంతులు మిత్ర ధ్వయం గోదావరి తీరాన్ని సుసంపన్నం చేసారు.

సంఘ సంస్కర్త  కందుకూరి


సంఘసంస్కరణ కర్త అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది  కందుకూరి వీరేశలింగం పంతులు గారే.

కందుకూరి గారు 1848 ఏప్రిల్ 16న పున్నమాంబ, సుబ్రహ్మణ్యం దంపతులకు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు.  ఏడేళ్ళ వయసున్న బాపమ్మ(రాజ్యలక్ష్మి) తో కందుకూరికి 13 యేట వివాహం జరిగింది. 1870లో కోరంగిలో ఇంగ్లీషు స్కూలులో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. అనంతరం ఆయన సంఘ సంస్కరణలవైపు మొగ్గుచూపారు.

బెంగాల్లోని బ్రహ్మసమాజ ఉద్యమం, బొంబాయిలోని ప్రార్థన సమాజం వీరేశలింగాన్ని బాగా ప్రభావితం చేశాయి. మూఢనమ్మకాలు, ఆచారాలు, సంఘంలోని దుశ్చర్యలపై పోరాడారు. రాజమండ్రిలో 1881 డిసెంబర్ 11న 22 ఏళ్ళ గోకులపాటి శ్రీరాములు, 12 ఏళ్ళ గౌరమ్మ (బాలవితంతువు)కు పెళ్ళి జరిపించారు. ఈ వివాహాన్ని అపడానికి, పెళ్ళి కూతురును ఎత్తుకు పోవడానికి వీరేశలింగంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. విద్యార్థులు, ఆంగ్లేయుల  సహకారంతో పెళ్ళి సజావుగా జరిగింది. తర్వాత మద్రాసులో 1883 జూన్ 7న ఒక వితంతు వివాహం జరిపించారు. దీంతో వీరేశలింగం ప్రభావం దక్షిణ భారత దేశం అంతటా వ్యాపించింది.అలా గోదావరి పుష్కరాల సమయంలో ఒక వితంతు వివాహం జరిపించారు. 1897లో వీరేశలింగం ఆధ్వర్యంలో మద్రాసు బ్రహ్మ సమాజం హాలులో సరోజినీదేవి, డాక్టర్ గోవిందరాజులనాయుడు కులాంతర, భాషాంతర వివాహం జరిగింది. 1905లో హితకారిణీ సమాజాన్ని రాజమండ్రిలో స్థాపించారు. అప్పట్లో రూ.41,500 విలువ చేసే ఆస్తులను సమాజానికి ధారాదత్తం చేశారు. 1906లో వీరేశలింగం కులాన్ని సూచించే యజ్ఞోపవీతాన్ని త్యజించి కులాన్ని పూర్తిగా విడనాడారు.సంస్కరణోద్యమానికి మద్రాసు సరైన వేదికని భావించి వీరేశలింగం తన కార్యకేంద్రాన్ని మద్రాసుకు మార్చి వితంతు శరణాలయాన్ని స్థాపించారు. 1919 మే 27న కందుకూరి తుది శ్వాస విడిచారు. మరణించేవరకు జాతి సంస్కరణోద్యమమే ధ్యేయంగా జీవితాన్ని గడిపారు. తన సమాధిపై "యధార్థ ఏకేశ్వర విశ్వాసి"  అని లిఖించవలసిందిగా కోరుకున్నారు.

సాహితీ వేత్త చిలకమర్తి

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు 1867లో  పశ్చిమ గోదావరి జిల్లా లోని ఖండవల్లి గ్రామంలో జన్మించారు . చిన్నతనం నుంచి ఆయన సాహితీ రంగంపై మక్కువ చూపేవారు. వీరవాసరం, నరసాపురం తర్వాత రాజమండ్రిలో చదువుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలోనే సాహి త్యంపై దృష్టి పెట్టారు. అదే ప్రక్రియ క్రమంగా ఆయనకు జాతీయ కవిగా పేరు తెచ్చింది. కథలు, నవలలు రచించి సున్నిత హాస్యం జోడించి సాహితీ రంగాన్ని సుసంపన్నం చేశారు. కీచకవధ, సౌందర్యతిలకం, నీలచరిత్ర, పారిజాతపాహరణం, మార్కేండేయ పురా ణం వంటివి రాశారు. కొంతకాలం పాటు ఆయన కలకత్తాలో ఉన్నారు. తిరిగి రాజమండ్రి వచ్చాక ఆర్యసమాజ బోధకుడు పండిత శివనాధ శాస్త్రి తో  పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగంతో సాన్నిహిత్యం ఏర్పడింది. కందుకూరి స్థాపించిన హితకారిణి సమాజానికి ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. ఎన్నో సాహితీ ప్రక్రియలతో ఎన్నో అవార్డులు పొందారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆయన ‘భరతఖండంబు చక్కటి పాడియావు’ అంటూ బ్రిటీషు వారిపై రచించిన పాట ఆ రోజుల్లో మారుమోగిపోయింది. 1946లో సాహితీ సామ్రాట్ దివంగతులయ్యారు.

27, మే 2016, శుక్రవారం

నువ్వాదరిని... నేనీదరిని ....గోదారి కలిపింది ....ఇద్దరినీ (1)

కవల పిల్లల్లాంటి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జన్మించిన వీరు, ఎక్కడో కలిశారు..ఎలాగో కలిశారు. రావుగోపాల రావు- అల్లురామలింగయ్య  సినీరంగంలో కళాకారులుగా జంటగా కలసి ఏంతో చరిత్ర సృష్టించారు.

రావుగోపాలరావు- అల్లు రామలింగయ్య


రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య జంట.. సృష్టించిన డైలాగుల అలజడి.. ఆరోజుల్లో ఒక సెన్సేషన్. ఎన్నివందల సినిమాల్లో వారు నటించినా.. ఏనాడు ప్రేక్షకులకు విసుగు పుట్టలేదు. వారు తెరపై కనిపించగానే ప్రేక్షకుల్లో నవ్వులు..పువ్వులై విరిసేవి. 90వ దశకం వరకూ తెలుగుతెరపై రావు గోపాలరావు విలనిజం, ఆయన డైలాగ్ డెలివరి, అతనికి సహాయంగా ఉంటూ అతనినే దెప్పిపొడుస్తూ చక్కటి హాస్యాన్ని పండించే అల్లు రామలింగయ్య ధ్వయాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. రావుగోపాలరావుది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అయితే.. అల్లు రామలింగయ్యది  పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. వీరిద్దరూ జంటగా నటించిన సినిమాలు ఎన్నో శతదినోత్సవాలు చేసుకున్నాయి. 

రావుగోపాలరావు 1937జనవరి 14న కాకినాడలో జన్మించారు. అక్కడ యంగ్ మెన్స్   హ్యాపీ క్లబ్లో సభ్యుడిగా ఉంటూ ఆ వేదిక ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు.ఆ దశలోనే దర్శకుడు గుత్తా రామినీడు సినిమాల్లో అవకాశం కల్పించారు. తొలిరోజుల్లో గొంతు బాగోలేదని డబ్బింగ్ చెప్పించారు. తర్వాత అదే గొంతుతో ఒక కొత్త వరవడి సృష్టించారు. విలన్ పాత్రలతోపాటు ఉదాత్త నటన పోషించిన ఆయన బాపు రమణల సృష్టి ‘ముత్యాల ముగ్గు’లో పెద్ద మనిషి పాత్రతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇలా వందలాది చిత్రాల్లో నటించిన ఆయన 1994లో దివంగతులయ్యారు. 

1922లో అల్లు రామలింగయ్య పాలకొల్లులో జన్మించారు. ఆయనకు హోమియో వైద్యం అంటే ఇష్టం. ఆయన కూడా నాటక రంగం నుంచే 1950ప్రాంతంలో ఆయన సినిమా రంగంలో అడుగెట్టారు. అంతకుముందు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. పుట్టిల్లు సినిమాలో పురోహితుడి పాత్రతో ఆకట్టుకున్నారు. తరువాత హాస్యనటుడిగా ఆయన వెనుదిరిగి చూడలేదు. ‘దొంగరాముడు, మాయాబజార్, మిస్సమ్మ,అప్పు చేసి పప్పుకూడు, వేటగాడు, ఊరికి మొనగాడు, ముత్యాలముగ్గు, అందాలరాముడు, మంత్రి గారి వియ్యంకుడు’ వంటి సినిమాల్లో అగ్ర హీరోలందరితోను నటించిన ఆయన ప్రత్యేకంగా రావుగోపాలరావుతో అల్లు రామలింగయ్య ది సూపర్ హిట్ కాంబినేషన్.

 రావుగోపాలరావు  విలనిజంతో సీరియస్ ఉంటే, అల్లు రామలింగయ్య  ఆయన పక్కనేఉండి సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ వుండేవారు.

25, మే 2016, బుధవారం

GODAVARI CINE SOWRABHALU -1 ( గోదావరి సినిమా సౌరభాలు-1 )

గోదావరి గడ్డకి, సినిమా రంగానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఈ గోదావరి నీటిలో ఏదో మహిమ వుంది. ఈ రెండు జిల్లాలనుంచి ఎంతో మంది సినీ ప్రముఖులు తయారయ్యారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి,  అంజలీదేవి, సూర్యకాంతం, రేలంగి, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, E.V.V.సత్యనారాయణ, బాపు-రమణ, చిరంజీవి, కోడి రామకృష్ణ, సుకుమార్, కృష్ణుడు, అల్లరి నరేష్, అంజలి, హేమ మొదలయిన ఏంతో మంది ఈ గోదావరి గడ్డ మీద పుట్టిన వారే. వారి గురించి కొంత సమాచారం తెలుసుకుందాం .   

చిరంజీవి (CHIRANJEEVI)

చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అని  ఆంధ్ర ప్రేక్షకుల అభిమానంగా పిలుచుకునే స్థాయికి చేరుకున్నారు . మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి ఆగష్టు 22, 1955 న జన్మించాడు. చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కథానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కుడా సినిమా హీరోగా ఎదిగారు.. చిరంజీవి "ప్రజారాజ్యం" అని ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర ప్రభుత్వములో మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం 150 వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు,


దాసరి నారాయణరావు (DASARI NARAYANA RAO)

డా. దాసరి నారాయణరావు  సినిమా దర్శకుడు,రచయిత,సినీ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1947, మే 4న జన్మించారు. అత్యధిక చిత్రాల నిర్మిచిన దర్శకుడుగా గిన్నిస్స్ బుక్   లో చోటు సంపాదించారు . దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టభద్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవారు. అనతి కాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయము చేసారు , వారందరూ ఇప్పుడు  గొప్ప స్థానాలలో వున్నారు .

అంజలి (ANJALI)

అంజలి తూర్పు గోదావరి జిల్లా , మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. అంజలికి  ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నై కి  మకాం మార్చి సినిమాలలో నటించడం ప్రారంభించింది . సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగులో మంచి   గుర్తింపు  వచ్చి బిజీతారగా మారింది.




ఆలీ (ALI)


ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడుగా గుర్తింపు పొందాడు . .ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమం డ్రిలో ఒక నిరుపేద కుటంబంలో జన్మిం చాడు. తండ్రి అబ్దుల్ సుభాణ్ దర్జీ పని చేసే వాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. ఆలీ చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచు కున్నాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. బాల నటుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా పాపులర్ అయ్యాడు . అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేటు  ఇచ్చి సత్కరించారు .




కోడి రామ కృష్ణ (KODI RAMAKRISHNA)


కోడి రామ కృష్ణ నాటక రంగం నుంచి వచ్చి న ప్రతిభావంతు లైన దర్శ కులలో ఒకడు. ఈయన స్వస్థలం పాలకొ ల్లు. పాలకొల్లులో గల లలిత కళాంజలి అనే సంస్థ ద్వారా అనేక నాటకాలలో  వేషాలు వేసారు. ఈయన తీసిన చిత్రాలు 175 రోజులు ఆడటం వలన ఈయనను సిల్వర్ జూబ్లీ దర్శకుడని పిలుస్తారు . ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ య్య (1981), కోడి రామకృష్ణకు దర్శ కుడిగా తొలిచిత్రం . దర్శకుడిగా దాసరి నారా యణరా వుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ, దాసరి నారాయణ రావు గారి  శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. ఈయన ప్రముఖ హీరో ఎన్.టి. రామారావు మినహా అందరు కథా నాయకుల సినిమాలు తీసారు . నూరు పైగా చిత్రాలు చేసిన నలుగురు తెలుగు దర్శకులలో ఒకరు. (దాసరి, కె.ఎస్.ఆర్ దాస్, కె.రాఘవేంద్ర రావులు మిగతా మువ్వురు). దర్శ కునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయ త్నించారు.




ఆర్. నారాయణమూర్తి (R.NARAYANA MURTHY)

R. నారాయణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్న తనం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీయార్ మరియు నాగేశ్వరరావుల సినిమాలు చూసి, విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితా నికి పునాది పడిందని చెప్పుకున్నారు. శంఖ వరంలో ఉన్నత పాఠశా లలో చేరాడు. అక్కడే నారాయణమూర్తికి సామాజిక స్పృహ కలి గింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా తనదైన బాణీని కొనసాగిస్తున్నాడు.



కృష్ణుడు(KRISHUDU)
కృష్ణుడు తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతల పల్లిలో జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనూ మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని బెంగుళూరులోనూ పూర్తి చేశాడు. ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను చేస్తూ గుర్తిపు పొందిన సినిమా నటుడు . హ్యాపీడేస్ చిత్రం తర్వాత కృష్ణుడు హీరోగా వినాయకుడు, విలేజిలో వినాయకుడు, నాకూ ఓ లవర్ ఉంది తదితర చిత్రాలలో హీరోగా నటించాడు.






సుకుమార్ (SUKUMAR)


సుకుమార్ స్వగ్రామం రాజోలు కి దగ్గరలో గల మట్టపర్రు గ్రామం.సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు అధ్యాపకుడు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 సరిగ్గా నడవలేదు. నాల్గవ ఛిత్రం 100% లవ్ సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చెసింది.అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి. మరెంతో మంది ప్రముఖ కధానాయకులతో సినిమాలు తీయడానికి రెడీ గా వున్నాడు.



తనికెళ్ల భరణి (TANIKELLA BHARANI)


తనికెళ్ళ భరణి  స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురంలో జులై 14, 1956 లో జన్మించారు.  తెలుగు సినిమా నటుడు,మంచి రచయత గా గుర్తింపు పొందారు . తెలుగు భాషాభిమాని.  తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకలాకళా కోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు



24, మే 2016, మంగళవారం

COASTAL ANDHRA PRADESH (కోస్తాంధ్ర)



కోస్తా లేదా కోస్తాంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని సముద్ర తీరప్రాంతము.

ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు  ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.

మొత్తము కోస్తాలో 9 జిల్లాలు వున్నాయి అవి వరుసగా

(1) శ్రీకాకుళం  (2) విజయనగరం  (3) విశాఖపట్నం  (4) తూర్పు గోదావరి  (5) పశ్చిమ గోదావరి  (6) కృష్ణా జిల్లా (7) గుంటూరు  (8) ప్రకాశం  (9)నెల్లూరు

బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ మొత్తం ప్రాంతాన్ని సర్కారు అని కూడా పిలుస్తారు . ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరం వెంబడే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం మనది . గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు,కొబ్బరి పంటలు ఇక్కడ ప్రధానంగా పండుతాయి.

23, మే 2016, సోమవారం

DUVVURI SUBBARAO (Ex.Governer RBI)

DUVVURI SUBBARAO (Ex.Governer RBI)


దువ్వూరి సుబ్బారావు గారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ 22వ గవర్నర్  గా పనిచేసారు. దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆగష్టు 11, 1949న జన్మించారు. హైస్కూలు విద్యని కోరుకొండ సైనిక పాఠశాల లో చదివారు. CRR  కాలేజీలో B.Sc., చదివారు. ఆ తరువాత అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టాపొంది, ఆంధ్రా యునివర్సిటీ నుండి Phd పొందారు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి, ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు . ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు.  కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు.


నిర్వహించిన పదవులు

1988–1993 :  కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రెటరీగా
1993-1998 :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా
1998-2004:    ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం
2004–2008 :   కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా
2008-20013:   రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా

20, మే 2016, శుక్రవారం

Konaseema.....Coconut Gardens.....Farmers Problems (కోనసీమ.....కొబ్బరి తోటలు....రైతుల ఇబ్బందులు)

కొబ్బరి దింపు
కోనసీమ(Konaseema) ........ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది కొబ్బరి తోటల అందాలే... తూర్పు, పశ్చిమ జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కొబ్బరి తోటలు కనువిందు చేస్తాయి.. కోనసీమ ప్రాంతాల వారితో వియ్యం పొందాలంటే ఎంతగొప్పవారైనా ఆసక్తితో ముందుకొచ్చేవారు. ఐదెకరాల కొబ్బరి పండించే మాగాణి భూమి ఉందంటే ఆరైతు జమిందారీ లెక్కలలో ఉన్నట్టే.. ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు.. రెండు దశాబ్దాల నుంచి కొబ్బరి రైతులు దిగుబడి ఉంటే ధరలేక.. ధర ఉంటే దిగుబడిలేక వరుస నష్టాలను చవిచూస్తూ చివరకు కొబ్బరి పంటకు బదులు ప్రత్యామ్నాయాలవైపు దృష్టిసారిస్తున్నారు..

 కొందరు రైతులు కొబ్బరి తోటలను తొలగించి వ్యవసాయ భూములుగా, చేపల చెరువులుగా మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డెల్టా ప్రాంతంలో కొబ్బరి తోటలు 50శాతానికి తగ్గిపోయాయి. చేలగట్లు, కాల్వగట్లు, పుంతలు, ఇంటి పెరడు ఇలా పలు ప్రాంతాల్లో కొబ్బరి  సాగుచేస్తున్నప్పటికీ, తోటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.. కొబ్బరి ధరలలో వ్యత్యాసం ఉండటం, చెట్ల నుంచి కొబ్బరి  కాయలు దింపడానికి సైతం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో కొబ్బరిపై రైతులు నిరాశక్తత పెంరిగింది.

కొబ్బరిదింపు కార్మికుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. దింపు కార్మికులలో ఇప్పుడు పాతతరం కార్మికులు మినహా యువత ఒక్కశాతం కూడా కుల వృత్తివైపు రావడంలేదు. విద్యావకాశాలు మెరుగుపడడం, ఉపాధి అవకాశాలు పెరగడంతో రెండు దశాబ్దాల కాలంలో దింపు కార్మికులు పదిశాతానికి తగ్గిపోయారు.. ఇప్పుడు ఒక్కచెట్టు నుంచి కొబ్బరికాయలు దింపాలంటే జిల్లాలోని ఆయా ప్రాంతాలను బట్టి రూ. 15 నుంచి రూ. 25 డిమాండ్‌ చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి కాయలు దింపడానికి రూ. 500లు తీసుకుంటుంటే, మరి కొన్ని ప్రాంతాలలో వందకాయలకు 10 కాయలు చొప్పున దింపు కూలీగా తీసుకుంటున్నారు. ఇలా అధికమొత్తం ఖర్చుతో కొబ్బరి దింపుతున్నప్పటికీ గతంలో మాదిరిగా నెల రోజులకు ఒక పర్యాయం కాకుండా నాలుగు నెలలకు ఒకసారి కొబ్బరి దింపు తీయిస్తున్నారు.


Hydraulic Equipment for coconut dropping 
చెట్ల నుంచి కొబ్బరి కాయలు దింపడానికి అనేక ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినప్పటికీ  
సత్ఫలితాలనివ్వలేదు.. హైడ్రాలిక్‌ నిచ్చెనలు, కోతులకు శిక్షణ ఇవ్వడం, కొబ్బరి దింపడానికి కార్మికులకు శిక్షణ ఇవ్వడం ఇలా అనేక విధాలు ప్రయత్నాలు చేసినప్పటికీ దింపు సమస్యకు పరిష్కారం దొరకలేదు. 


Hybrid coconut tree
ఈపరిస్థితులలో హైబ్రీడ్‌ కొబ్బరి పెంపకం మేలని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు.. హైబ్రీడ్‌ కొబ్బరి నాలుగు సంవత్సరాల్లోనే కాపునకు రావడం, 15 ఏళ్ళ ప్రాయం వరకు చెట్టు కాయలు చేతికి అందే ఎత్తులోనే ఉండటం, అనంతరం కేవలం కొక్కెం సహాయంతో దింపుకునే అవకాశం ఉండటంతో ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు.


19, మే 2016, గురువారం

COCONUT GEO TEXTILES




Coconut Coir Geo Textiles

 కొబ్బరి రైతుల పాలిట కల్పవృక్షమే కాదు...ఆధునిక టెక్నాలజీ జోడించడంతో పారిశ్రామిక అక్షయ పాత్రగా కూడా మారుతోంది. కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఈ పరిశ్రమలో జియో టెక్స్‌టైల్‌, ఫర్నిచర్‌ వంటి ఉత్పత్తులతోవినూత్న ఆవిష్కరణలకు ఆలవాలంగా మారింది. ఒకప్పుడు కొబ్బరి కాయ మాత్రమే ఉపయోగించుకుని డొక్కను పారేసి స్థితి నుంచి ఆ వృథా నుంచే కోట్లాది రూపాలయ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే స్థితి వచ్చింది. 


Estuarine Abrasion Prevented using Coir Geotextile
ప్రస్తుతం టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ కొబ్బరి ఆధారిత సృజనాత్మక ఉత్పత్తులు తయారవుతున్నాయి. కొబ్బరి పీచు తాళ్ళే కదా అనుకుంటాం. కానీ ఆ తాళ్ళ అల్లికతో చేసే జియో టెక్స్‌టైల్‌ నదీ, సముద్రం వల్ల భూమి కోతలను కూడా నివారించవచ్చంటే ఆశ్చర్యమే మరి. అవును ఈ పరిశ్రమలో టెక్నాలజీ అంతగా ఉపయోగపడుతుంది. లోపమల్లా ప్రోత్సాహం లేకపోవడమే. ఈ విషయం పక్కన పెడితే ముందుగా కొబ్బరి ఆధారిత ఉత్పత్తులేమిటనేది తెలుసుకుంటే ఆశ్చర్యమే మరి. ఎందుకంటే కొబ్బరి పొట్టుతో తయారు చేసే సేంద్రియ ఎరువుకు ఉజ్వల భవిష్యత్‌ ఉంది. ఒకప్పుడు కొబ్బరి కాయ మాత్రమే ఉపయోగంలో ఉండేది. కొబ్బరి బొండాంలో కాయను వలిచేసి డొక్కను వృథాగా పారవేసే పరిస్థితి. ఇప్పుడు ఆ వృథాగా పారేసే డొక్క నుంచి కోట్ల రూపాయల విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నామంటే టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. 

రాష్ట్రంలో సుమారు లక్షా ఇరవై వేల హెక్టార్ల విస్తీర్ణంలో కొబ్బరి పంట సాగువుతోంది. ఇందులో ఏభై శాతం విస్తీర్ణం తూర్పు గోదావరి జిల్లాలోనే సాగువుతోంది. కొబ్బరి సాగులో దేశంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంటే, ఆంధ్ర రాష్ట్రం నాలుగోవ స్థానంలో ఉంది. కొబ్బరి పీచు నుంచి తాడు, డోరుమ్యాట్లు, పరుపులు, కొబ్బరి ఇటుకలు, పొట్టు నుంచి ఎరువు తదితర ఉత్పత్తులు, జియో టెక్స్‌టైల్‌, ఫ్లైవుడ్స్‌, ఫర్నిచర్‌, అలంకరణ వస్తువులు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు బదులుగా కుండీల వంటి ఉత్పత్తులు ఇలా ఎన్నో... ఎన్నెన్నో.. కొబ్బరి పీచు ఆధారిత ఉత్పత్తులు విస్తరిస్తున్నాయి. 

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న కాయర్‌ బోర్డు ఎన్నో ప్రోత్సాహక పథకాలను అందిస్తుంది. చిత్తశుద్ధిగా కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమల్లో ఔత్సాహికులను ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా వరకూ నిరుద్యోగాన్ని పారదోలి ఉపాధి విస్తృత ప్రాతిపదిక కల్పించినట్టే.

 రాజమండ్రిలోని కాయర్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల సముదాయాలకు సుమారు రూ.12 కోట్ల నిధులను విడుదల చేసింది. కాయర్‌ ఉద్యమి యోజన పథకం కింద కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారికి ఇప్పటికే పరిశ్రమలు నడుపుతున్న వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. పది లక్షల రూపాయల అంచనా విలువతో యూనిట్‌గా పరిశ్రమలను నెలకొల్పే విధంగా ప్రోత్సాహ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ఐదున్నర లక్షలు బ్యాంకు రుణం అయితే, నాలుగు లక్షలు రాయితీ, మిగిలిన రూ.50 వేలు లబ్ధిదారుని భాగస్వామ్య మొత్తంగా ప్రభుత్వం నిర్ణయించింది. 


Geo Textile usage in Road Making
వృథా నుంచి ఉత్పత్తులు సాధించి సంపద సృష్టించే ఈ కల్పవృక్షం నుంచి ఎన్నో పర్యావరణ స్నేహపూరిత ఉత్పత్తులకు విదేశాల్లో సైతం విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందుకే గత ఏడాది రూ.1500 కోట్ల విలువైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయగలిగారు. దీని ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. ఇందులో సుమారు రూ.450 కోట్ల విలువైన కొబ్బరి పొట్టే ఎగుమతి జరిగిందంటే విదేశాల్లో కొబ్బరి పొట్టుకు ఎంత గిరాకీ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆధునిక టెక్నాలజీతో కొబ్బరి పీచు ఆధారిత ఉత్పత్తులకు ఎంతో డిమాండ్‌ పెరుగుతోంది. కొబ్బరి పీచుతో జియో టెక్స్‌టైల్స్‌ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ రోడ్ల నిర్మాణంలో విధిగా ఈ జియో టెక్స్‌టైల్‌ను వినియోగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టింది. ఈ జియో టెక్స్‌టైల్‌ వల్ల రోడ్ల మన్నిక దీర్ఘకాలంగా ఉండటంతోపాటు అంచుల కోత లేకుండా పటిష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నదీ, సముద్ర కోతలను కూడా ఈ టైక్స్‌టైల్స్‌తో నివారించవచ్చు. అందుకే విదేశాల్లో అయితే అక్కడ ఉన్న ఆధునిక టెక్నాలజీతో ఇరిగేషన్‌ వంటి భారీ ప్రాజెక్టులకు సైతం కొబ్బరి జియో టెక్స్‌టైల్‌ను వినియోగిస్తున్నారు. 

వృథాగా విడిచిపెట్టే కొబ్బరి పొట్టు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఎరువుగా మారింది. టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటే చెత్తను కూడా సద్వినియోగం చేసుకోవచ్చుని నిరూపిస్తున్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. మట్టికి బదులుగా కొబ్బరి పొట్టును సేంద్రియ ఎరువుగా వినియోగించే స్థాయిలో టెక్నాలజీ పెరిగిందంటే అందుకే ఇప్పుడు కల్పవృక్షమే కాదు...ఔత్సాహికులకు అక్షయపాత్ర కూడా. 

కొబ్బరి  ఉత్పత్తులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అక్షయ పాత్రగా మారుతున్నాయి.  ఆధునిక టెక్నాలజీతో ఈ కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమ మరింత విస్తరిస్తుంది అని ఆశించడం అతిశయోక్తి కాదు. 

17, మే 2016, మంగళవారం

ADURRU, Famous Buddist Place (Near Razole Town)

Adurru, locally called as Dubaraju Dibba  is a small village  in  East Godavari district , where Buddhism had its roots. The distance between Razole to Adurru is 18 km.

Adurru, is a 2,400-year old Buddhist site located on the western bank of the Vainetaya Godavari. 

Adurru   was declared as ‘Mahakshetram’ after archaeologists discovered a Buddhist mahastupa. 

The site was excavated by the Archaeological Survey of India (ASI) in 1923 and declared as a protected monument in 1955. Among the three most popular Buddhist stupas in the world, the first one was constructed in Adurru, the second in Ranchi and last one in Sarnath.

According to historical evidence the ASI found, the foundation stone for Adurru was laid by Sanghamithra, a Buddhist nun and daughter of King Ashoka, enroute to Sri Lanka.

This Buddhist centre is home to the remains of stupas, several upa-stupas, chaityas and viharas, this is considered as ‘Mahakshetram’ by Buddhist monks and followers even today. In 1953, the ASI conducted excavations that brought to light the remains of stupas, chaityas and viharas. The most beautiful and the most famous one is the mahastupa, built like a giant wheel with a platform with a diameter of 17 feet. Located around it are vedika (drum) and ayaka platforms that mark the cardinal directions. In 1955, the ASI declared this a protected monument.

The excavations also brought to light artefacts such as jars, troughs, dishes and bowls. On the front side, (on the east) are two upa-stupas with the same wheel-based structure.

There are also round and square structures on the west side of the main stupam — all systematically connected with each other from all the sides.

A non-government organisation called Buddha Vihar Trust, Adurru, formed by a group of retired employees, currently takes care of it.

Photo Collection of Adurru Mahakshetram




15, మే 2016, ఆదివారం

Kotipalli - Narsapuram Railway Line (Review)



పర్యాటక సొగసులతో అలరారే పచ్చని సీమ... పొంగిపొర్లే జలవనరులు.. పుష్కలంగా పంటలు, భూగర్భంలో చమురు, సహజవాయువుల లభ్యత, కొబ్బరి ఉత్పత్తులు, అరటి రవాణాతో కోనసీమకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. నిత్యం వేలాది మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కోనసీమకు రైలుమార్గం ఏర్పాటు దశాబ్దాలుగా కలగానే ఉంది.

ఏటా రూ.800 కోట్ల విలువైన ఉత్పత్తుల రవాణా
కోనసీమ నుంచి ఏటా దేశంలోని ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌, తెలంగాణా ఇతర రాష్ట్రాలకు దాదాపుగా రూ.800 కోట్ల విలువైన కొబ్బరి ఉత్ప త్తులు రవాణా అవుతున్నాయి. ఇవి కాకుండా రూ.400 కోట్ల విలువైన పీచు, ఇతర ఉత్పత్తులు కూడా ఎగుమతి అవుతున్నాయి. వీటి పన్నుల రూపేణా రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. కోనసీమ మీదుగా రైలు మార్గం ఉంటే కొబ్బరి ఉత్పత్తులన్నీ రైళ్ల రవాణాతోసాగే అవకాశం ఉంటుంది. దీంతో కోన సీమలోని కొబ్బరి రైతు లకు ఊరట లభిస్తుంది.

అరటితోనూ భారీ ఆదాయం
కోనసీమ నుంచి ఏటా రూ.200 కోట్ల విలువైన అరటి ఎగుమతులు వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రావులపాలెం, మద్దిపేట గ్రామాల నుంచి రోజుకు రూ.40 లక్షల విలువైన ఎగుమతులు ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌కు ఎగుమతి అవున్నాయి. ఇక లంక గ్రామాలైన అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల నుంచి బత్తాయి, నిమ్మ తదితర పంటలు ఎగుమతి అవుతున్నాయి. తమలపాకులు కూడా భారీగా ఇక్కడి నుంచే ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాయి.



నిర్మాణరంగ వనరులు 
రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, రావులపాలెం, గోపాలపురం, కొత్తపేట, అయినవిల్లి తదితర ప్రాంతాల నుంచి ఆయా ఇసుక ర్యాంపుల నుంచి నిత్యం 40 - 50 లారీల్లో తెలంగాణాకు ఎగుమతి అవుతుంది. రైల్వే రవాణా సౌకర్యం ఉంటే ఇసుక రవాణా రాష్ట్ర ఎల్లలు దాటే అవకాశం ఉంది. కోనసీమలోని లంక ప్రాంతాల్లో తయారుచేసే ఇటుకకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గిరాకీ ఉంది. నిత్యం రావులపాలెం, కొత్తపేట మండలాల నుంచి 70కుపైగా లారీల్లో ఇటుక బాహ్యప్రాంతాలకు వెళ్తుంది. రైలుమార్గాలు ఉంటే ఈ వ్యాపారాలు ఏస్థాయిలో జరుగుతాయో చెప్పకనే అవగతం అవుతుంది.

కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూమిపూజ జరిగిన తర్వాత 15 ఏళ్లలో గత రైల్వేబడ్జెట్‌లో ఇప్పటివరకు మొత్తమ్మీద రూ.85 కోట్లు మాత్రమే వెచ్చించారు. 15 ఏళ్ల క్రితం అప్పటి లోక్‌సభ ప్రజాపతి జి.ఎం.సి. బాలయోగి కృషితో కోనసీమ రైల్వే లైను ఏర్పాటు ప్రతిపాదన ముందు కొచ్చింది. ఈ మేరకు నాటి కేంద్ర ప్రభుత్వం రూ.685 కోట్ల అంచ నాలతో కోటిపల్లి - నర్సాపురం వరకు రైల్వేలైన్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. అమలాపురంలోని రైల్వేస్టేషన్‌ను, భట్నవిల్లిలో సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం బాలయోగి దుర్మరణంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతీ లేదు. అప్పటి నుంచి కోనసీమ రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు నేతలకు ఎన్నికల హామీగా మారిపోయింది. ప్రస్తుతం  కోనసీమ రైల్వేలైన్‌ అంచనా  సుమారు రూ.1,200 కోట్లకు చేరింది. ఇది కార్యరూపం దాల్చితే ఏటా సుమారు సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖ పొందే అవకాశం ఉన్నా ప్రభుత్వ పెద్దలతోపాటు రైల్వే ఉన్నతాధికారులు చొరవచూపలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత ముఖ్యమైన కోటిపల్లి- నర్సాపురం రైల్వేలైన్‌ను తప్పకుండా నిర్మించాల్సిన అవసరం ఎంతో వుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో శ్రద్ద చూపించవలసిందిగా గోదావరి ప్రజలు కోరుతున్నారు.

Tender Coconut

మండే ఎండల నుంచి ఉపశమనం కల్గించే ఒక దివ్యఔషధం కొబ్బరిబొండం. అస్వస్థతకు గురైన రోగులకు వైద్యుల సహాయం లేకుండా తక్షణ శక్తిని ప్రసాదించే ఒక సిలైన్‌. ఆబాల గోపాలానికి తీపిరుచులందించే ఒక అరుదైన పానీయం. 



అందుకే కొబ్బరిబొండం.. యావత్‌ మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సంజీవని. ప్రచండ భానుడి ప్రతాపానికి ఇబ్బందిపడుతున్నవారికి ఇది దాహం తీర్చడమే కాదు ఎన్నో పోషకాలందించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఉండే సహజసిద్ద నీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని గతం  నుంచి  వైద్యులు ప్రధానంగా ఈ కొబ్బరిబొండాలను సిఫార్సు చేస్తున్నారు. వడగాల్పులకు గురైనవారు తక్షణం ఈకొబ్బరి బొండం నీరు త్రాగడం చేత కోలుకోగలుగుతున్నారు. ఏడాది పొడవునా ఈ కొబ్బరిబొండాల వినియోగం ఉన్నప్పటికీ ఈ వేసవిలో మాత్రం రోజుకు ఒక్కసారైనా దీన్ని సేవించడం పరిపాటిగా మారింది. అందుకనే పట్టణాల్లోనే కాక పల్లెల్లోనూ ఈ కొ బ్బరిబొండాల వినియోగం విపరీతంగా పెరిగింది. 

 మన పూర్వీకులు చెప్పినట్లు కొబ్బరిచెట్టు నిజంగానే కల్పవృక్షం. ఎందుకంటే జీవించడానికి అవసరమైన నీరు, ఆహారం, ఆవాసం, ఉపాధి కల్పిస్తుంది. ఈ చెట్టులో ప్రతీభాగం ఉపయోగమైనదే. దీనిలో వ్యర్ధమన్నదే ఉండదు. ఇంటి ఆవరణలో ఏమాత్రం జాగా ఉన్నా ఈ కొబ్బరిచెట్టును పెంచుతూ ఉంటారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో కొ బ్బరిదే పెద్దపీట. పూజాపురస్కారాల్లో, యజ్ఞయాగాదుల్లో నారీకేళం పగలాల్సిందే.. ఆ నీటితో అభిషేకించాల్సిందే. మిగిలిన భాగాల సంగతి ఎలాగున్నా కొబ్బరినీరు, కొ బ్బరిబొండాలు, కాయల వినియోగం ప్రధానంగా ఉంటుంది. 

బొండం కాయగా పెరిగేకొద్దీ అందులో యాంటీఆవ్లూల శాతం మారుతూ ఉంటుంది. అందుకే ఆయుర్వేద నిపుణులు దీన్ని బాల, మధ్య, పక్వ అని మూడుదశలుగా విభజించారు. 

బాల (లేత) కొబ్బరిబొండాల్లో 90 నుండి 95శాతం నీరే ఉంటుంది. ఒంటిని చల్లబర్చే గుణాలు ఇందులో ఎక్కువ. ఇది జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది.ఈ నీళ్ళలోని తీపిగుణం ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. 

కాస్త లేత కొబ్బరి కట్టినదే మధ్యవయసు బొండం. ఇందులో నీళ్ళలో పోషకాలశాతం ఎక్కువ. పిండిపదార్ధాలు, ఖనిజాలు, ఫాస్పరస్‌, విటమిన్‌ ఏ, బీ, సీలు మిగిలిన రెండింటిలో కంటే ఎక్కువగా ఉంటాయి. 

కొబ్బరి బాగా కట్టినదే పక్వదశ. జీర్ణశక్తి సరిగా లేనివారు ఈ దశలోని కొబ్బరి ఎక్కువగా తినడం మంచిది కాదు. 
అందుకనే మూడింటిలోనూ లేత, మధ్యవయసు బొండాలే శరీరంలోని వివిధ రకాల ఖనిజాల పనితీరుకు తోడ్పడతాయి. 

సహజ సిలైన్‌ కొబ్బరిబొండం ఎమర్జెన్సీ గ్లూకోజ్‌ కూడా. ప్రపంచ యుద్దంలో అత్యవసర సమయంన ందు గ్లూకోజ్‌కు బదులుగా కొబ్బరినీళ్ళను నింపి ఇంజక్ట్‌ చేసేవారంట. ఇప్పటికీ సిలైన్ అందుబాటులో లేని దేశాల్లో వీటినే బాటిల్స్‌లోకి నింపి వాడతారట. ఎందుకంటే ఇవి సహజంగానే స్టెరిలైజ్డ్‌ మినరల్‌ వాటర్‌. ఎలాంటి మలినాలు, సూక్ష్మజీవులు ఉండవు. వెంటనే రక్తంలో కలిసి ప్లాస్మాలా పనిచేస్తుంది. అందుకనే పెద్దలు ఎంగిలి కాని నీరుగా చెబుతారు. గ్యాస్ట్రోఎంటరైటీస్‌ రోగులకు దీన్ని ఇంజక్ట్‌గా చేయడంవల్ల సిలైన్‌కంటే బాగా పనిచేస్తుంది. అయితే కొన్ని దేశాల్లోనే కాక మన దేశంలో కూడా కొబ్బరిబొండాల నీరును కవర్లు, టిన్‌ల్లో ప్యాకింగ్‌ చేసి విక్రయాలు జరుపుతున్నారు. అయితే నేరుగా కొబ్బరిచెట్టు నుండి తీసిన బొండాలను తాగినప్పుడు ఉండే పోషకాలు ఈ ప్యాకింగ్‌వల్ల కాస్త తగ్గే అవకాశాలుంటాయి.

ఆరోగ్యపరంగా.. అనేక రోగాలనుంచి ఈ కొబ్బరిబొండాలు ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ బొండం సేవించడంవల్ల కామెర్లు, యూరినల్‌ డిసీజెస్‌, క్యాన్సర్‌, కిడ్నీలో రాళ్లు, వడదెబ్బ, శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం, శరీరంపై వచ్చే పెలుసు వంటి వాటికి ఈ కొబ్బరిబొండం నీరు ఎంతో ఔషధంగా  పనిచేస్తుంది. 

కొబ్బరినీటిలో పోషకాలు.. 

వంద గ్రాముల లేత కొబ్బరినీళ్ళలో శక్తి 17.4శాతం, నీరు 95.5శాతం, కార్బోహైడ్రేట్‌లు 4.4శాతం, ప్రోటీన్‌లు 0.01శాతం, క్రొవ్వు 0.01శాతం, నైట్రోజన్‌ 0.05శాతం, ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ 0.56శాతం, పొటాషియం 290 మి.గ్రా., కాల్షియం 44 మి.గ్రా., సోడియం 42 మి.గ్రా., మెగ్నీషియం 10మి.గ్రా., ఫాస్ఫర్‌ 9.2మి.గ్రా., ఐరన్‌ 106 మి.గ్రా., కాపర్‌ 26 మి.గ్రా. ఉంటాయి.

13, మే 2016, శుక్రవారం

KADIAM NURSERIES





KADIAM, abutting the National Highway-5 and 20 Km from Rajahmundry is the hub of nurseries of myriad varieties of flowers and fruits. It is only since last few years that flower festivals are being organised.

Kadiyam nurseries spread in 3,500 acres in 11 villages of Kadiyam mandal (Kadiam, Kadiapulanka, Burrilanka, Veeravaram, Pottilanka, Venkatayammapeta and Damireddipalli etc..) in East Godavari are doing good business and providing considerable employment to about 25,000 agriculture labour. The nurseries in Kadiam are as old as 100 years and at present there are more than 600 nurseries, the extent of each ranging from just 0.5 cents to 200 acres.

In India, there are about 20,000 nurseries employing 60,000 people. But in Kadiam nurseries alone, more than 25,000 people are engaged in the 600-odd nurseries. It was some 80 years back that one Ravi Chinna Rao started grafting of fruit plants and flowers as a hobby, but production on commercial lines was initiated by one Akula Subbarao, a name that is inexorably linked with the development of nurseries in these parts.


Nursery products from Kadiapaulanka are exported to every nook and corner of the country. But export potential to foreign countries remained untapped.

Some  Kadiam Nurseries products