వరి
తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట ప్రధానమైన పంట . జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తున్నారు. మొత్తం గోదావరి డెల్టాలో పండే వరిలో 40 శాతం తూర్పుగోదావరి జిల్లాలో పండుతోంది. ఇక్కడ ఖరీఫ్, రబీల్లో వరిని ప్రధాన పంటగా సాగుచేస్తారు. కోనసీమలో ప్రధానంగా సాగుచేస్తున్న వరి పంటకు గోదావరి నీరే ఆధారం. ధవళేశ్వరం బారేజ్ కాలువల ద్వారా వచ్చే గోదావరి నీళ్ళతో గోదావరి డెల్టాలోని తూర్పు డెల్టా, మధ్య డెల్టాలలో ఈ పంటను సాగుచేస్తున్నారు.
కొబ్బరి

కొబ్బరి పంటపై పరిశోధన చేసేందుకు గాను జిల్లాలోని అంబాజీపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. కొబ్బరి పంటకు వ్యాపిస్తున్న తెగుళ్లు, పురుగుల నివారణకు సంబంధించి పరిశోధనలు చేసేందుకు రాష్ట్రంలోనే ఏర్పాటైన ఏకైక పరిశోధనా కేంద్రం అంబాజీపేట ఉద్యాన ( కొబ్బరి) పరిశోధన కేంద్రం. 1955 సంవత్సరంలో ఈ కేంద్రాన్ని, 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు. ముఖ్యంగా కొబ్బరి పంటకు వ్యాపించే తెగుళ్లు, పురుగుల నివారణకు ఇక్కడ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు. క్రొత్త రకాల కొబ్బరిమొక్కలను సృష్టిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కొబ్బరిమార్కెట్టుకు పెట్టింది పేరు అంబాజీపేట. ఇక్కడ ప్రతి బుధ, గురువారాలు కొబ్బరిసంత జరగుతుంది, లక్షలాది రూపాయల్లొ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కొబ్బరి, కొత్తకొబ్బరి, కురిడీ కొబ్బరికి సంబంధించి వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. కురిడీ వ్యాపారుల సంఘం, కొబ్బరి వర్తక సంఘాలతో పాటు కొబ్బరిరైతులను చైతన్యం చేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ నేతృత్వంలో అంబాజీపేట కేంద్రంగా రైతు సంఘం ఉంది.
అరటి

చెఱుకు
జిల్లాలోని దాదాపు 35 వేల ఎకరాల్లో చెఱుకు పంట సాగువుతోంది. వచ్చిన పంటలో అధిక భాగం చక్కెర పరిశ్రమలకు చేరుతుంది. దిగుబడిలో 10% మాత్రమే రైతులు స్వయంగా బెల్లం తయారు చేస్తుంటారు. కిర్లంపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ఈ ప్రక్రియ అధికంగా సాగుతోంది. పండించడానికి వ్యయం అధికంగా అవ్వడం మరియు దీర్ఘకాలిక పంట కావడంతో చెరకు సాగుపై గతంలో కన్నా మక్కువ తగ్గింది.
పత్తి

జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట, గోకవరం, తుని, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది.
మొక్కజొన్న

అపరాలు

పామాయిల్

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి