ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయాలను మడ అడవులు అంటారు.నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి వుంటాయి.
మడ అడవులలో పెరిగే చెట్ల మరియు పొదల వేర్లు భూమిలోకి అల్లుకుపోయి సముద్రం నుంచి వచ్చే అటుపోట్లను, బలమైన ఈదురుగాలులను, సునామీలను అడ్డుకుని తీరప్రాంతంలో భూమి సముద్ర కోతకు గురికాకుండా కాపాడుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాధారము.
![]() |
Coringa Wildlife Sanctuary |
![]() |
Coringa Wildlife Sanctuary |
తూ.గో.జిల్లా లో కాకినాడ సమీపంలొని కొరంగి వద్ద వున్న కోరంగి అభయారణ్యం (మడ అడవులు) , దాదాపు 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి వున్నాయి. ఈ అభయారణ్యం సంరక్షణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ పర్యవేక్షిస్తుంది.
మడ అడవుల్లో విహారం మనోహర దృశ్య కావ్యం. ఉప్పుటేరులు, పాయలు మధ్యలో పచ్చని పరుపు పరిచినట్లుగా విస్తరించి ఉండే మడ అడవులు పర్యాటక అందాలకు వేదికగా నిలుస్తున్నాయి.
![]() |
korangi mada forest |
![]() |
Coringa Wildlife Sanctuary |
ఈ అభయారణ్యం కాకినాడ నుండి 20 కి.మీ, రాజమహేంద్రవరం నుండి 70 కి.మీ దూరంలో వున్నది . ఉప్పునీటి మొసళ్ళు ఈ అభయారణ్యం ప్రత్యేకత. కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడానికి డిసెంబర్ నుండి జూన్ నెలల మధ్య కాలం అనువైనది.
![]() |
Coringa Wildlife Sanctuary |
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి