20, జూన్ 2016, సోమవారం

Rajamahendravaram




Rajamahendravaram
 భారదేశంలో చారిత్రాత్మికంగా,రాజకీయ,ఆర్ధిక ,సంస్కృతీ పరంగా  తూర్పుగోదావరి జిల్లాకి ఒక ప్రత్యెక స్టానం వుంది. జిల్లాలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి) నగరం వీటన్నిటికి కేంద్రబిందువుగా భాసిల్లుతోంది. ఎన్నో సంఘ సంస్కరణలకు తోలి అడుగులు రాజమండ్రి లోనే పడ్డాయి.   క్రీ.శ.919 నుంచి 934 మధ్యకాలంలో రాజమహేంద్రవరం నగరాన్ని నిర్మించినట్టు చారిత్రక అధరాలు వున్నాయి.  తూర్పు చాళుక్యుల  రాజధానిగా రాజమండ్రి ఒక వెలుగు వెలుగొందింది. 

గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులన్నిటిలోను పెద్దది. దీనిని ప్రపంచంలో వున్న అతిపెద్ద నదుల్లో ఒకటిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల భూగర్భ సర్వే సంస్థ గుర్తించింది. ప్రాచీనకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో జైన, బౌద్ధాలు ఉజ్వలంగా ఉండేవి. ఈనాటి పంచారామాలు, అన్నవరం కొండ ఒకటినాటి బౌద్ధ క్షేత్రాలే అన్న వాదన కూడా వుంది.  


Dowleswaram barrage in Rajahmundry 
18 శతాబ్దంలో గోదావరి మీద నిర్మించిన ఆనకట్ట వల్ల రాజమండ్రి ముఖచిత్రమే మారిపోయింది. క్రీ.శ.1852లో గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్టను నిర్మించడంతో తూర్పు గోదావరితోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం కూడా మారిపోయింది. ఉభయగోదావరి జిల్లాలకు కాటన్ నిర్మించిన ఆనకట్ట ప్రాణాధారంగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులుగా గోదావరి, తాండవ నదులు, బంగాళాఖాతం, తూర్పు కనుమలు ఉన్నాయి. గోదావరి నది జిల్లాను సారవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి గౌతమి, వశిష్ట నదులుగా చీలిపోయింది. ఈ మధ్య భూభాగంలో ఉన్న డెల్టా భూభాగాన్నే కోనసీమ అంటారు. గోదావరి రాజమండ్రిలో మొత్తం ఏడు పాయలుగా చీలి, అక్కడ నుండి సుమారు 100 కి.మీ ప్రయాణించి  బంగాళాఖాతంలో కలుస్తోంది. 


Sir Arthur Cotton
1844లో కాటన్ విశాఖపట్నంలో పని చేస్తుండేవారు. ఆ సమయంలోనే ప్రభుత్వం అడగకపోయినా ఆయన గోదావరి డెల్టా అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను రూపొందించి పంపారు. డెల్టా ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ వస్త్ర కర్మాగారాలు మూసివేయడంతో ప్రజలు నష్టపోయారని, ప్రత్యామ్నాయంగా వరి, చెరుకు పంటలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కాటన్ సూచించాడు. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. గోదావరి డెల్టాకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి నివేదిక పంపాలని ప్రభుత్వం కోరింది. 20 లక్షల ఎకరాల భూభాగంలో సర్వే చేశారు. రోజుకి 10 నుంచి 15 మైళ్లు గుర్రంపై తిరిగి కాటన్ సర్వే నిర్వహించేవారు. గోదావరి డెల్టా సర్వే నివేదిక 1845 ఏప్రిల్ 17న ప్రభుత్వానికి సమర్పించారు. ఆనకట్ట నిర్మాణం రూ.4.75లక్షల నిర్మాణ వ్యయంతో 1847 ఏప్రిల్లో ప్రారంభమైంది. 1852 నాటికి రూ.15 లక్షల వ్యయంతో గోదావరిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది.
Road cum Rail Bridge in Rajahmundry

 గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం జిల్లా జనాభా పెరుగుదలపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత 1871 నాటికి అంటే ప్రాజెక్టు నిర్మించిన 20 సంవత్సరాల తర్వాత జిల్లా జనాభా రెండు రెట్లు పెరిగి 15,92,939కి చేరింది. విశాఖ, గంజాం తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా జిల్లాలో స్థిరపడ్డారు. అనంతర కాలంలో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాయి. జిల్లాలోని రాజమహేంద్రి నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాయి. 2001లో 48,72,622 ఉన్న జనాభా 2011 నాటికి 51,51,549కి చేరింది.



Kandukuri Veeresalingam Pantulu's house in Rajahmundry


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి