![]() |
Rajamahendravaram |
గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులన్నిటిలోను పెద్దది. దీనిని ప్రపంచంలో వున్న అతిపెద్ద నదుల్లో ఒకటిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల భూగర్భ సర్వే సంస్థ గుర్తించింది. ప్రాచీనకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో జైన, బౌద్ధాలు ఉజ్వలంగా ఉండేవి. ఈనాటి పంచారామాలు, అన్నవరం కొండ ఒకటినాటి బౌద్ధ క్షేత్రాలే అన్న వాదన కూడా వుంది.
![]() |
Dowleswaram barrage in Rajahmundry |
![]() |
Sir Arthur Cotton |
![]() |
Road cum Rail Bridge in Rajahmundry |
గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం జిల్లా జనాభా పెరుగుదలపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత 1871 నాటికి అంటే ప్రాజెక్టు నిర్మించిన 20 సంవత్సరాల తర్వాత జిల్లా జనాభా రెండు రెట్లు పెరిగి 15,92,939కి చేరింది. విశాఖ, గంజాం తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా జిల్లాలో స్థిరపడ్డారు. అనంతర కాలంలో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాయి. జిల్లాలోని రాజమహేంద్రి నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాయి. 2001లో 48,72,622 ఉన్న జనాభా 2011 నాటికి 51,51,549కి చేరింది.
![]() |
Kandukuri Veeresalingam Pantulu's house in Rajahmundry |
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి